డీలర్లు రైతులుకి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలి
న్యూస్ తెలుగు /సాలూరు : విత్తనాలు ఎరువులు పురుగు మందులు అమ్మేటప్పుడు రైతులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని సాలూరు వ్యవసాయ శాఖ ఏడి మధుసూదన్ రావు అన్నారు శనివారం సాలూరు ఏడిఏ ఆఫీసులో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లతో లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్లు రైతులు కి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మేటప్పుడు తప్పనిసరిగా బిల్ అందజేయాలనీ అన్నారు. ఎప్పటికప్పుడు స్టాక్ వివరాలు,అమ్మకాలు వివరాలు,వాటి ధరలు వివరాలు బయట డిస్ప్లే బోర్డు లలో నమోదు చేసి పొందుపరచాలి అని తెలిపారు.ఎమ్మార్పీ ధరలు మించి విక్రయించకూడదని తెలిపారు…
ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి శ్రీమతి కే శిరీష మరియు టెక్నికల్ అసిస్టెంట్ శ్రీమతి అనురాధ , ఏఈఓ లు శ్రీను, శైలజ పాల్గొన్నారు. (Story:డీలర్లు రైతులుకి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలి)

