మహిళా పారిశ్రామిక వేత్తల్ని ప్రోత్సహించాలి
న్యూస్ తెలుగు /సాలూరు : సాలూరు లో లేఖ్య ఎంటర్ప్రైజ్ పసుపు ప్రాసెసింగ్ యూనిట్ అధినేత అల్లాడి సునీత కు ఉత్తమ మహిళా పారిశ్రామిక వేత్త గా ఫాఫ్సీ అవార్డ్ వచ్చిన సందర్భంగా ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డా. డివిజి శంకరరావు ఆమెను అభినందించారు.గిరిజన ప్రాంతాల్లో స్థానిక వనరుల్ని పూర్తిగా వినియోగించుకునేలా పరిశ్రమల స్థాపన జరగాలని, ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ ప్రాంతంలో పసుపు ప్రాసెసింగ్ యూనిట్ స్థాపించి,ఒడిదుడుకులు ఎదుర్కొని విజయవంతంగా పరిశ్రమ నడుపుతున్న సునీత గారిని అభినందించి,ఆ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆరా తీశారు.ఈ యూనిట్ సిబ్బంది,కార్మికుల్లో ఏభై శాతం మంది గిరిజన మహిళలు ఉన్నట్లు తెలుసుకుని హర్షం వ్యక్తం చేశారు.ఆమె విజయం చాలా మందికి స్ఫూర్తి కలిగిస్తుందని,గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి ప్రతీ మహిళా చైతన్యం వంతం కావాలని,అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు.ఆయన తో బాటు,వారి శ్రీమతి స్వర్ణలత సునీత గారిని అభినందించారు. (Story: మహిళా పారిశ్రామిక వేత్తల్ని ప్రోత్సహించాలి)