నేడు సాలూరు మున్సిపల్ ఆఫీస్ లో పిజిఆర్ఎస్
జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
న్యూస్ తెలుగు /సాలూరు / పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని సోమవారం సాలూరు మున్సిపల్ ఆఫీసులో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సాలూరు మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి పిజిఆర్ఎస్ నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు దీన్ని గమనించి, తమ సమస్యలను తెలియజేయవచ్చని ఆయన చెప్పారు. జిల్లా అధికారులు అందరూ సాలూరులో జరిగే పిజిఆర్ఎస్ కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ ఆ ప్రకటన ద్వారా ఆదేశించారు. (Story:నేడు సాలూరు మున్సిపల్ ఆఫీస్ లో పిజిఆర్ఎస్)