బిజెపి ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు చరమగీతం పాడాలి
తిరుమలేశుని సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేసిన బీజేపీ
రైతులకు మూడు నల్ల చట్టాలు రద్దు చేస్తానని, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర చట్టం చేస్తానని మోసం చేసిన బీజేపీ
అమరావతిని ఢిల్లీని తలదాన్నే రాజధానిని చేస్తానని మోసం చేసిన బీజేపీ
దేశంలో వంద రోజుల్లో అధిక ధరలు తగ్గిస్తానని నిత్యావసర సరుకుల ధరలు రెట్టింపు ధరలు పెంచి నా బిజెపి
పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను సామాన్యుడు వాడుకునే నిత్యావసర సరుకుల ధరలను మూడింతలు పెంచిన బిజెపి
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న బిజెపి. ఫ్యాక్టరీ కి సొంత గనులు ఇవ్వలేని బిజెపి
దేశాన్ని 200 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి నెట్టిన బిజెపి
న్యూస్ తెలుగు/వినుకొండ : దేశంలోనూ మన రాష్ట్రంలోనూ బిజెపి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడిచినప్పటికిని ఈ దేశానికి మన రాష్ట్రానికి వరగబెట్టిందేమీ లేదని దేశం యావత్తు అప్పుల ఊబిలో కూరుకొని పోయిందని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. వినుకొండలో శాఖ మహాసభలు జరుగుతున్న సందర్భంగా శుక్రవారం రాత్రి అజాద్ నగర్ లోని కాసింకా డివిజన్, సీతయ్య డివిజన్, శివయ్య డివిజన్, కొమరం భీమ్ డివిజన్, ఝాన్సీ లక్ష్మీ డివిజన్, జహిరుద్దీన్ ఖాన్ డివిజన్ లలో శాఖా మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మహాసభల్లో పాల్గొని ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి మహాసభల షెడ్యూల్ ప్రకటించినందున గ్రామశాఖ నుండి దేశవ్యాప్తంగా పార్టీ జాతీయ మహాసభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా కేంద్రం లోని పెద్దలు 2014 ఎన్నికలలో బిజెపి అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని, అమరావతిని ఢిల్లీని తలదన్నే రాజధానిని చేస్తానని, వెనుకబడ్డ జిల్లాలకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తానని, కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మిస్తానని, ఆరుకాలం శ్రమించి పంటలు పండించే రైతన్నకు మూడు నల్ల చట్టాలు రద్దుచేసి రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధరను చట్టబద్ధత చేస్తానని వ్రాత పూర్వకంగా హామీ ఇచ్చి నమ్మించి మోసం చేసిందని తను అధికారంలోకి వస్తే 100 రోజుల్లో అధిక ధరలు తగ్గిస్తానని దేశంలో సామాన్యుడు వాడుకునే నిత్యావసర సరుకుల ధరలు పెట్రోలు డీజీలు గ్యాస్ మోయలేని అధిక ధరల భారాలు మోపి ప్రజల నడ్డి విరిచారని ఆయన విమర్శించారు. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూకటి వేళ్ళతో పెకలిస్తూ బిజెపి పాలిత రాష్ట్రాలలో నియంతృత్వ పోకడలతో పాలన కొనసాగిస్తున్నారన్నారు. మతోన్మాద పోకడలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజల మాన,ప్రాణాలకు రక్షణ కరువైపోయిందని దళిత మైనారిటీలపై హత్యలు దాడులు నిరంతరం కొనసాగుతున్నాయని వారి జీవితాలకి భద్రత లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. భారతదేశ స్వాతంత్ర్యానికి కుల మతాల విచక్షణ లేకుండా ఈ దేశంలోని హిందువులు ముస్లింలు సిఖులు క్రిస్టియన్లు బుద్ధులు జైనులు ఇలా అనేక మతాల కులాల జాతుల ప్రజలు స్వాతంత్ర్యం కోసం పోరాడి తమ ప్రాణాలర్పించారని అటువంటి ప్రజలపై వివక్షత చూపటం హత్యలు అమానుషాలు కక్షలు కార్పణ్యలతో హత్యకాండతో అమానవీయంగా ప్రవర్తించటం దుర్మార్గమన్నారు. దీనికి రుజువే మణిపూర్ రాష్ట్ర ఘటనలు ఆ రాష్ట్రంలోని అధికారంలో ఉన్న బిజెపి మైటేయులు అనే అధికార పార్టీ తెగవారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మైనారిటీ వర్గీయులైన కుకీజాతుల వారిని 300 మందిని హతమార్చి మహిళలను వివస్త్రలుగా చేసి బహిరంగంగా ఊరేగించి వారిని అత్యంత దారుణంగా వివస్త్రలుగా చేసి ఊరేగించి వారిని దారుణంగా మానభంగం చేసిన పరిస్థితుల్లో కేంద్రంలోని బిజెపి పెద్దలు పెదవి విప్పి ఇది అన్యాయం అని మాట్లాడలేనటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా అధికారాన్ని చలాయిస్తూ మైనారిటీ తెగలపై విరుచుకుపడుతున్నారు. బిజెపి అధికారంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా మైనారిటీలపై దారుణమైన హింసాకాండను కొనసాగిస్తూన్నారు. తమ చెప్పుచేతలలో లేని ప్రతిపక్ష రాజకీయ పార్టీలపై ఈడి, సిబిఐ వ్యవస్థలను ఉపయోగించుకొని వారిపై దాడులు నిర్వహించి వారిని జైళ్లలో వేసి భకంపితులను చేస్తున్నారు ఉదాహరణకు దేశంలోని పశ్చిమబెంగాల్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ ఆఫ్ పార్టీ వారిని తదితర బిజెపియేతర రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీల నాయకులను ఇబ్బందుల పాలు చేస్తూ వారు బిజెపి తీర్థం పుర్చుకుంటే పునీతులైపోతున్నట్లుగా వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు. కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించి దేశ ప్రజలకు సమర్పించిన రాజ్యాంగాన్ని సైతం మెజారిటీ పార్లమెంటు స్థానాలు వస్తే పూర్తిగా మార్చి వేస్తామని బిజెపి పెద్దలు అంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూల్చి వేయటానికి సిద్ధపడుతున్నారు అధ్యక్షతరహా పాలన చేయటానికి సాహసం చేయ పూనుకుంటున్నారు ఈ నేపథ్యంలో భారత దేశంలో ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ, వారి యొక్క సంస్థలు ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ శక్తులు
ఈ విధంగా దేశంలో నియంతృత్వంగా పరిపాలన నిర్వహిస్తూ తమకు అడ్డు లేదనే విధంగా శాశ్వతంగా దేశాన్ని వారే పరిపాలించాలనే దుష్ట తలంపుతో ఎన్నికల వ్యవస్థల్ని, రక్షణ, న్యాయవ్యవస్థలను సైతం రాజకీయాలకు ముడిపెట్టి ప్రజలను నయవంచన చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ మతసామరస్యం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం కంకణబద్ధులై పోరాటాలకు ముందుకు రావాలని కార్యకర్తలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, సిపిఐ మాజీ వైస్ చైర్మన్ సండ్రపాటి సైదా, పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలు వెంటనే అమలు చేయాలని పట్టణాలలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని వృద్ధాప్య వితంతు వికలాంగుల పెన్షన్లను వెంటనే అర్హులైన వారికి మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు రాయబారం వందనం, పిన్ని బోయిన వెంకటేశ్వర్లు, తిరుమల శెట్టి,కె. మల్లికార్జున, షేక్ మస్తాన్, సోడాల సాంబయ్య, జల్లి వెంకటేశ్వర్లు, రమణ, కాశమ్మ , జల్లి పద్మ, గోవిందమ్మమ,మరియమ్మ, వెంకటయ్య రాములు తదితరులు ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అనంతరం ఆయా శాఖలకు శాఖ కార్యదర్శులను ఎన్నుకున్నారు. (Story:బిజెపి ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు చరమగీతం పాడాలి)