Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ శ్యామలాంబ పండగ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు 

శ్యామలాంబ పండగ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు 

0

శ్యామలాంబ పండగ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు 

న్యూస్ తెలుగు/సాలూరు : శ్యామలాంబ అమ్మవారి పండగను విజయవంతంగా నిర్వహించి దిగ్విజయం చేసిన ప్రజలకు, అధికార సిబ్బందికి, కార్మికులకు ప్రత్యేక అభినందనలు తెలియజేసి వారిని ఘనంగా సన్మానించిన ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మాత్యులు గుమ్మిడి సంధ్యారాణి ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పండగ నిర్వహణలో ఎంతో కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పండుగ సందర్భంగా శాంతిభద్రతలు, శుభ్రత, వాహనాల రాకపోకల నిర్వహణ, భక్తులకు ఏర్పాటుచేసిన సదుపాయాలు అన్నింటిలోనూ అధికారులు, సిబ్బంది, కార్మికులు సమిష్టిగా పని చేసిన తీరు ప్రశంసనీయమని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కృష్ణారావు, సానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, సాలూరు పట్టణ సిఐ, అప్పలనాయుడు, రూరల్ సిఐ రామకృష్ణ, తాసిల్దార్ ఎన్వి రమణ , మున్సిపల్ సిబ్బందికి పత్రికా విలేకరులకు, సన్మానించారు.(Story :శ్యామలాంబ పండగ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు  )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version