ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ యోగా మాసోత్సవ కార్యక్రమం
న్యూస్ తెలుగు / వినుకొండ : కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వినుకొండ పురపాలక సంఘం నందు అంతర్జాతీయ యోగా మాసోత్సవ కార్యక్రమం మే 21 నుండి జూన్ 21 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా లయోలా హై స్కూల్ మరియు ఎన్ ఎస్ పి సాయిబాబా గుడి ప్రాంగణం నందు మొదటిరోజు జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ. యోగా యొక్క ప్రయోజనాలు అపారమైనవి మరియు విస్తృతమైనవి. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శారీరక బలం మరియు సమతుల్యత మెరుగుపడతాయని ఆయన అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ షకీలా దస్తగిరి మాట్లాడుతూ. యోగా వల్ల ఆరోగ్యం, మరియు శ్రేయస్సు, మానసిక స్పష్టత మెరుగుపడతాయని ఒత్తిడిని తగ్గించి జీవిత సవాళ్లు సులభంగా ఎదుర్కోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, కౌన్సిలర్లు పాపసాని బ్రహ్మయ్య , పివి సురేష్ , రెడ్డి నగేష్ , యోగా గురువులు, మున్సిపల్ సిబ్బంది మరియు యోగా సాధకులు పాల్గొన్నారు. (Story:ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ యోగా మాసోత్సవ కార్యక్రమం)