తమకు న్యాయం చేయాలంటూ వినుకొండ పోలీస్ స్టేషన్ ముందు ఆవేదన వ్యక్తం చేసిన మహిళ
న్యూస్ తెలుగు/వినుకొండ : కుట్రపూరితంగా అప్పులు ఉన్నాయంటూ అత్తారింటి నుండి వచ్చిన ఆస్తిని మరల తిరిగి లాగేసుకోవడానికి బెదిరిస్తున్నారని, తమను ప్రభుత్వ చీఫ్ ఈఫ్, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కాపాడాలంటూ వినుకొండ కోడలు చిలకలూరిపేట గోళ్ళ బిందు అనే మహిళ తన ఇద్దరి పిల్లలతో కలిసి వినుకొండ పోలీస్ స్టేషన్ వద్ద మీడియా ముందు కన్నీటి పర్యాంతమైంది. తన మామ గోళ్ళ మహేశ్వరరావు, ఫోర్జరీ సంతకాలతో ఆస్తులను బదులాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించింది. ఆస్తులుగా ఉన్న భవనాల తాళాలను పగలగొట్టారని, అక్కడితో ఆగకుండా ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని, తమకు ఎలాగైనా ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు న్యాయం చేయాలని వేడుకుంటు వినుకొండ పట్టణంలోని పలువురుపై ఆరోపణలు చేశారు.(Story :తమకు న్యాయం చేయాలంటూ వినుకొండ పోలీస్ స్టేషన్ ముందు ఆవేదన వ్యక్తం చేసిన మహిళ )