Home వార్తలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే యూజీసీ నూతన సంస్కరణలను వ్యతిరేకించండి- PDSU

రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే యూజీసీ నూతన సంస్కరణలను వ్యతిరేకించండి- PDSU

0

రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే యూజీసీ నూతన సంస్కరణలను వ్యతిరేకించండి- PDSU

న్యూస్‌తెలుగు/వ‌న‌ప‌ర్తి : కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ నూతన సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలలో గవర్నర్ల ద్వారా నేరుగా విసీల నియామకాలను చేపట్టడం అంటే యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని హక్కులను కాలరాయడమేనని PDSU మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు కందుకూరి పవన్ కుమార్ అన్నారు. సోమవారం PDSU వనపర్తి జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో యు జి సి నూతన సంస్కరణలకు వ్యతిరేకంగా తేదీ. మార్చి 26 పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించే సదస్సు కు సంబంధించిన గోడపత్రికలను వనపర్తి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఆయన ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 90 శాతం మంది పేద వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులు ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారని యు జి సి నూతన సంస్కరణలు ఉన్నత విద్యను వీరికి దూరం చేయనున్నాయని అన్నారు.
ప్రభుత్వ యూనివర్సిటీలకు యూజీసీ అభివృద్ధి నిధులు ఫెలోషిప్ లో వివిధ రీసెర్చ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి విద్యార్థులకు తోడ్పాటు అందించేదని కానీ గత పదివేల బిజెపి పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఫెలోషిప్ల కోత పెట్టిందని యూనివర్సిటీలో అభివృద్ధికి బడ్జెట్ను కేటాయించకుండా పేద దళిత గిరిజన వర్గాల విద్యార్థులను యూనివర్సిటీ క్యాంపస్ లోకి రాకుండా అడ్డుకుంటుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో PDSU ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి సాయి కృష్ణ కమిటీ సభ్యులు రాకేష్,ప్రవీణ్ బీచ్ పల్లి, రాఘవేంద్ర నరేష్ రెడ్డి రాఘవేందర్ రెడ్డి, ఆంజనేయులు,కార్తీక్ దాసరం నాయక్ తోపాటు విద్యార్థులు పాల్గొన్నారు. (Story : రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే యూజీసీ నూతన సంస్కరణలను వ్యతిరేకించండి- PDSU)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version