వైఎస్ఆర్ సిపి ఆవిర్భవ దినోత్సవ వేడుకలు
న్యూస్ తెలుగు /సాలూరు : సంక్షేమం అభివృద్ధి కి పెద్ద పీట వేసి జనం కోసం అజెండాగా జనమే జెండాగా అన్ని వర్గాల వారి మన్ననలు పొందిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం బోసు బొమ్మ జంక్షన్ వద్ద వైఎస్ఆర్ సిపి ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఆయన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసే మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజన్న దొర మాట్లాడుతూ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదాల చెంత పుట్టి 14 వసంతాలు పూర్తిచేసుకుని ఎన్నో ఆటుపోట్లకు కష్ట నష్టాలు ఎదుర్కొనే ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల పాలనలో సంక్షేమం అభివృద్ధి కి పెద్ద పీట వేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని అన్నారు. జనం కోసం ఎజెండాగా జనమే జెండాగా అన్ని వర్గాల ప్రజల మన్నన పొంది, ప్రజల నమ్మకం విశ్వాసం కలిగిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అని చెప్పారు..వైఎస్ఆర్సిపి పార్టీ అంటే పేదల పార్టీ ఆని ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణాల పేదలకు బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చిన ఏకైక పార్టీ వైయస్సార్ పార్టీ అని అన్నారు. అదేవిధంగ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగా వైసిపి కార్యకర్తలు కార్యకర్తలు నాయకులు కు ఏ పని చేయవద్దని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి సూపర్ సెక్స్ పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలు ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలకు మోసం చేసిడని అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవి అనార్హుడనీ అని అన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని అన్నారు. వేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదని అన్నారు. మెడికల్ కాలేజీలో పేద విద్యార్థులకు చదువుకోడానికి సీట్లు ఇవ్వకుండా ఈ కుటమీ ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, గిరి రఘు, దండి శ్రీనివాసరావు, పిరిడి రామకృష్ణ, తాడ్డి శంకరరావు, కొల్లి వెంకటరమణ, మేకల శంకర్రావు, జన్ని సీతారాం వైయస్సార్ పార్టీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : వైఎస్ఆర్ సిపి ఆవిర్భవ దినోత్సవ వేడుకలు)