చలి వేంద్రాన్ని ప్రారంభించిన ఐ టి డి ఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ అపూర్వ భరత్
న్యూస్ తెలుగు /చింతూరు : చింతూరు ఐ టి డి ఏ ఆఫీస్ ముందు పి ఓ అపూర్వ భరత్ చలి వేంద్రాన్ని ప్రారంభించారు.మన్యం కవి, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, వరదసహాయక కార్యక్రమాలు, మొక్కలు నాటడం వంటి అనేక సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న యువ కవి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ అధ్యాపకునిగా పనిచేస్తున్న నూనె రమేష్ స్థానిక ఐ టి డి ఎ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఏర్పాటు చేశారు . ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు నూనె రమేష్ ను అభినందించారు. ఈ చలివేంద్రం ద్వారా నీరు అందించడం తో పాటు పర్యావారణాన్ని కాపాడమని, చెట్లను నరకొద్దు అని, ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మొలించాలని ప్రచారం చేయడం కూడా ముఖ్య ఉద్దేశ్యమని నూనె రమేష్ తెలియజేసారు. విద్యార్థులలో సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత పెంపొందించేలా విద్యార్థులను ఈ చలివేంద్రం నిర్వహణలో భాగస్వామ్యం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఐ టి డి ఎ సిబ్బంది స్థానిక మీడియా మిత్రులు, విద్యార్థులు వేముల చిరంజీవి, ముర్రం సురేష్, బంధం ప్రశాంత్, రవ్వ లక్ష్మణ్, మడకం మానస, సున్నం మత్తేశ్వరి, తుష్టి రాధ, ముర్రం సుబ్బలక్ష్మి, కిలో సాయి దుర్గ, కొవ్వాసి రజిత తదితరులు పాల్గొన్నారు. (Story : చలి వేంద్రాన్ని ప్రారంభించిన ఐ టి డి ఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ అపూర్వ భరత్)