భూవివాదం వల్లే రాజలింగమూర్తి హత్య
* పోలీసుల నిర్దారణ
* ఏడుగురు అరెస్ట్
* పరారిలో మరో ముగ్గురు
* సంబంధం ఉన్న అందర్నీ అరెస్టు చేస్తాం
* ఎస్పీ కిరణ్ ఖారే సమక్షంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
న్యూస్ తెలుగు/ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి : భూపాలపల్లి జిల్లాలో రాజలింగమూర్తి హత్య ధన్యవాదములు జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు హత్యతో సంబంధం ఉన్న దోషులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. పోలీసులు ఏడుగురిని అరెస్టు చేయగా మరో ముగ్గురు
పరారీలో ఉన్నారు.
నిందితులు వీరే :
A1 – రేణికుంట్ల సంజీవ్ (36)
A2 – పింగిలి శ్రీమంత్ (22)
A3 – మోరె కుమార్ (35)
A4 – కొత్తూరి కుమార్ (38)
A5 – రేణికుంట్ల కొమురయ్య
A6 – దాసరపు కృష్ణ (45)
A7 – రేణికుంట్ల సాంబయ్య (60)
పరారీలో ఉన్న నిందితులు:
A8 – కొత్త హరిబాబు – మాజీ వైస్ చైర్మన్ (బీఆర్ఎస్)
A9 – పుల్ల నరేష్
A10 – పుల్ల సురేష్
భూ వివాదంలో హత్య జరిగినట్లు భావించి ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నామని, ఈ హత్యతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు ఎస్పీ కిరణ్ ఖారే వెల్లడించారు
ఈ విలేకరుల సమావేశంలో భూపాలపల్లి డీఎస్పి సంపత్ రావు, భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్, చిట్యాల సీఐ మల్లేష్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, భూపాలపల్లి గణపురం, రేగొండ, టేకుమట్ల ఎస్బి లు సాంబమూర్తి, రమేష్, అశోక్, సందీప్, సుధాకర్, రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు . (Story :భూవివాదం వల్లే రాజలింగమూర్తి హత్య)