2 కోట్ల తో శిక్షణ కేంద్ర నిర్మాణానికి ప్రభుత్వం
గ్రీన్ సిగ్నల్
న్యూస్తెలుగు/వనపర్తి : గ్రామీణ ప్రాంతాల్లోని యువత స్వయం ఉపాధిలో స్వావలంబన పొందేందుకు ప్రభుత్వం వనపర్తి జిల్లా కేంద్రంలో స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసినట్లు శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. 2 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ నిర్మాణానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తిస్థాయిలో సహకారం అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ శిక్షణ కేంద్రం ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఈ కేంద్రంలో అందించే ప్రత్యేక శిక్షణతో యువకులకు వివిధ సంస్థలలో ఉపాధి కల్పన లభిస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. ఈ శిక్షణ కేంద్రం వనపర్తి లో ఏర్పాటు అయ్యేందుకు పూర్తిస్థాయిలో సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, జిల్లా ఇన్చార్జి మినిస్టర్ దామోదర రాజనర్సింహ గారికి, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. (Story : 2 కోట్ల తో శిక్షణ కేంద్ర నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్)