ప్రీ-ఫైనల్ పరీక్షలు: ఎంఈఓ ఆకస్మిక తనిఖీ
చింతూరు(న్యూస్ తెలుగు): చింతూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలను ఎంఈఓ లక్ష్మీనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వహణ తీరు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అంతా మంచి జరగాలని, ఉన్నత శ్రేణులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె బాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. (Story: ప్రీ-ఫైనల్ పరీక్షలు: ఎంఈఓ ఆకస్మిక తనిఖీ)