Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఫిబ్రవరి 1వ తేదీ నుండి భూమి  రిజిస్ట్రేషన్ విలువలు పెంపు

ఫిబ్రవరి 1వ తేదీ నుండి భూమి  రిజిస్ట్రేషన్ విలువలు పెంపు

ఫిబ్రవరి 1వ తేదీ నుండి

భూమి  రిజిస్ట్రేషన్ విలువలు పెంపు

గ్రోత్ సెంటర్ల ఆధారంగానే పెంపుదల
సగటున 15 నుండి 20 శాతం వరకు పెంపు
చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో తగ్గింపు
 రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్

న్యూస్‌తెలుగు/తాడేపల్లి: ఫిబ్రవరి 1వ తేదీ నుండి భూమి రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏఏ ప్రాంతంలో ఎంతెంత పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనే అంశాలపై పూర్తి నివేదికను జనవరి 15వ తేదీ కల్లా ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖపై తాడేపల్లి ఐజీ కార్యాలయంలో సోమవారం మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన విచ్చల విడి అప్పుల భారం నుండి రాష్ర్టం ఇప్పుడిప్పుడే కోలుకోంటోందని, అయితే రాష్ర్టానికి రెవెన్యూ కూడా అవసరమని, ఈ నేపథ్యంలోనే రిజిస్ర్టేషన్ విలువలు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే ఎక్కడెక్కడ గ్రోత్ కారిడార్లు ఉన్నాయో, ఎక్కడ భూమి రేట్లు బాగా పెరిగాయో అక్కడ మాత్రమే రిజిస్ర్టేషన్ విలువలను పెంచుతామని చెప్పారు. గత ప్రభుత్వం రిజిస్ర్టేషన్ విలువల పెంపును శాస్ర్తీయ పద్దతిలో కాకుండా ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్లిందని, దీంతో చాలా చోట్ల భూమి విలువల కంటే రిజిస్ర్టేషన్ విలువలు అధికంగా ఉన్నాయని తమ పరిశీలనలో తేలిందన్నారు. అటువంటి అన్ని చోట్ల రిజిస్ర్టేషన్ విలువలను తగ్గిస్తామని చెప్పారు. ఇలా విలువలు తగ్గించడం చరిత్రలో ఇదే మొదటిసారని చెప్పారు. విలువలు పెరిగే చోట సగటున 15 శాతం నుండి 20 శాతం వరకు పెంపుదల ఉంటుందని చెప్పారు. రాష్ర్టంలో వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖలోనే వస్తుండగా, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖలోనూ 10 శాతం వరకు గ్రీవెన్స్ వస్తున్నాయని చెప్పారు. వీటిన్నంటి పరిష్కరించే దిశగా తాము చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత ఏడాదితో పోల్చితే గత ఆరు నెలల్లో ఒక్క సెప్టెంబర్ మాసంలో తప్ప మిగిలిన అన్ని నెలల్లోనూ అదనపు ఆదాయమే వచ్చిందన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరానికి తాము టార్గెట్ గా పెట్టుకున్న 9,500 కోట్ల రూపాయల లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి తన స్వార్ధం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులను చాలా ఇబ్బందులు పెట్టారని, కానీ తమ ప్రభుత్వం వారితో స్నేహ పూర్వకంగా ఉంటూ సమస్యలన్నీ పరిష్కరిస్తుందని చెప్పారు. భూ వివాదాలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని, ఇప్పటికి లక్షా 70 వేల ఫిర్యాదులు రాగా 11 వేల ఫిర్యాదులను అక్కడిక్కడే పరిష్కరించినట్లు చెప్పారు. అయితే ఇలా పరిష్కరించిన సమస్యలను ముందుగానే ఎందుకు చేపట్టలేదంటూ సంబంధిత అధికారులను కూడా ప్రశ్నిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. విలేకరుల సమాశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ తోపాటు రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోదియా, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ శేషగిరిబాబు కూడా పాల్గొన్నారు.(ఫిబ్రవరి 1వ తేదీ నుండి భూమి రిజిస్ర్టేషన్ విలువలు పెంపు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics