Homeవార్తలుశ్రీరంగాపురం శ్రీ రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తా

శ్రీరంగాపురం శ్రీ రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తా

శ్రీరంగాపురం శ్రీ రంగనాథ స్వామి

ఆలయ అభివృద్ధికి సహకరిస్తా

న్యూస్‌తెలుగు/ వ‌న‌ప‌ర్తి : శ్రీరంగాపురం శ్రీ రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం కలెక్టర్ సతీసమేతంగా శ్రీరంగాపురం లోని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో కలెక్టర్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం కలెక్టర్ ఆలయ ప్రాంగణంలో కలియతిరిగి పరిసరాలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహకారం ఉంటుందని తెలిపారు. ఆలయంలో ఉన్న మ్యూజియంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ ను తిలకించారు. ఆలయానికి సమీపంలో ఉన్న సర్వ వర్గ సామూహిక భవనం, టూరిజం గెస్ట్ హౌస్ ను కలెక్టర్ సందర్శించి, పరిశీలించారు. అతిథి గృహంను బాగు చేసి వెంటనే వాడుకలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సామూహిక భవనానికి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి వాడుకలోకి తీసుకురావాలన్నారు. హసీల్దార్ మురళి, ఆలయ సిబ్బంది, తదితరులు ఉన్నారు. (Story : శ్రీరంగాపురం శ్రీ రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తా)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!