Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వినికిడి సమస్య లేని ఆంధ్రప్రదేశ్‌గా కొనసాగిస్తాం..

వినికిడి సమస్య లేని ఆంధ్రప్రదేశ్‌గా కొనసాగిస్తాం..

వినికిడి సమస్య లేని ఆంధ్రప్రదేశ్‌గా కొనసాగిస్తాం..

ఆరోగ్య శాఖామంత్రి ఎన్డీఏ కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబు.

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : వినికిడి సమస్య లేని ఆంధ్రప్రదేశ్‌గా కొనసాగించాలని ఆరోగ్య శాఖామంత్రి ఎన్డీఏ కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్జీవోహంలో డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ.. సెల్వియా సల్మాన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మెడికల్ ఆఫీసర్లకు, సూపర్వైజర్లకు ,ఆశా కార్యకర్తలకు సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పట్టణము గ్రామాలలో వినికిడి లేని వారిపై సర్వే చేసి నివేదికను తయారు చేయాలని తెలిపారు. ఈనెల 25వ తేదీ పోతుకుంట రోడ్డు నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో వినికిడి లోపం ఉన్నవారికి స్క్రీనింగ్ చేసి ఉచితంగా వినికిడి మిషను ఇవ్వబడునని తెలిపారు. అనంతరం మంత్రి ఎన్డీఏ కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వినికిడి లోపం ఉన్న వారిని సర్వేలో గుర్తించి అందరికీ న్యాయం జరిగేటట్లు అధికారులు చూడాల్సిన బాధ్యత ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయంతో పని చేసినప్పుడే కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లతోపాటు బిఎల్టిఓ డాక్టర్ తిప్పయ్య నాయక్, ఆప్తాలిమిక్ ఆఫీసర్, సిహెచ్వోలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. (Story : వినికిడి సమస్య లేని ఆంధ్రప్రదేశ్‌గా కొనసాగిస్తాం.. )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics