Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్

శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా శెట్టిపి జయ చంద్రారెడ్డి వరుసగా మూడోసారి ఎన్నిక

న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్( ఏపీ యుటిఎఫ్), శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా ధర్మవరం పట్టణానికి చెందిన శెట్టిపి జయచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం రోజున కదిరి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత ఉన్నత పాఠశాల నందు జరిగిన సత్యసాయి జిల్లా స్వర్ణోత్సవ మహాసభల నందు వరుసగా మూడవసారి (03) ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. జయచంద్రా రెడ్డి గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా యుటిఎఫ్ అధ్యక్షులుగా రెండుమార్లు మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా ఫ్యాప్టో చైర్మన్ గా కొనసాగారు.ఈ సందర్భంగా జయచంద్రా రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై రాజీలేని పోరాటం యుటిఎఫ్ కొనసాగిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అపరిస్కృతమైన ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలియజేశారు…. తన ఎన్నికకు ఏకగ్రీవంగా సహకరించిన జిల్లా వ్యాప్త యూటీఎఫ్ నాయకులకు, కార్యకర్తలకు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేశారు.. ఈయన ఎంపిక పట్ల ధర్మవరం జోన్ యుటిఎఫ్ నాయకులు రామకృష్ణ నాయక్, ఆంజనేయులు, లక్ష్మయ్య, హరికృష్ణ, సాయి గణేష్ , H.రామాంజనేయులు, అమర్ నారాయణరెడ్డి, మేరీ వర కుమారి ,లతా దేవి గోపాల్ రెడ్డి, శివయ్య, సకల చంద్ర శేఖర్, సురేష్, జనార్ధన్ బాబు, మల్లేష్, బిల్లే రామాంజనేయులు, రాంప్రసాద్, హరి శంకర్, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.(Story:ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!