Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి

గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి

0

గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి

మెడికల్ ఆఫీసర్ డాక్టర్- ఎన్. గౌతమి

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) ; గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే చక్కటి ఆరోగ్యం లభిస్తుందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్- ఎన్. గౌతమి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప, కార్య దర్శి మంజునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని శివానగర్లో గల అర్బన్ హెల్త్ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు వైద్యులు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ చేతులు మీదుగా పండ్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినెల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీల పట్ల గ్రామాలలో పట్టణాలలో పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. గర్భిణీ స్త్రీల పట్ల కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తలు తీసుకొని, ఎప్పటికప్పుడు వైద్య చికిత్సలను అందించి, ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం పొందేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని తెలిపారు. నెలవారి వైద్య చికిత్సలు తప్పనిసరిగా గర్భిణీ స్త్రీలు చేయించుకోవాలని తెలిపారు. సుఖమైన ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్లాలని తెలిపారు. ప్రభుత్వం కూడా అన్ని సౌకర్యాలను కల్పించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వేణుగోపాల్, సహకార దర్శి రామకృష్ణ, కోశాధికారి చంద్రశేఖర్, సభ్యులు రామకృష్ణ, సాయి ప్రసాద్, నాగరాజు, నారాయణరెడ్డి, ఏఎన్ఎం పుష్పలత, నారాయణమ్మ ఆశా వర్కర్లు పాల్గొన్నారు. (Story :గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version