Homeవార్తలుతెలంగాణఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం

నవంబర్ 9, 10 తేదీల్లో ప్రత్యేక క్యాంపైన్ డేస్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

న్యూస్‌తెలుగు/వనపర్తి : 1-1-2025 నాటికి 18 ఏళ్ళు నిండే యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నేడొక ప్రకటనలో సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం – 2025 లో భాగంగా, కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునే వారికోసం, మరియు మార్పులు, అభ్యంతరాల కోసం నవంబర్ 9, 10 తేదీల్లో ప్రత్యేక క్యాంపైన్ డేస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాంపైన్ లో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు తమ బూత్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారని, కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకునే వారు స్థానిక బూత్ లెవెల్ అధికారిని సంప్రదించి ఫారం-6 దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 29 న విడుదల చేసిన ఓటర్ ముసాయిదా లో అభ్యంతరాల కోసం ఫారం – 7, సవరణలకు ఫారం – 8 దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 28వ తేదీ వరకు దరఖాస్తూ చేసుకోవచన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో voters.eci.gov.in వెబ్సైటు ద్వారా కూడా దరఖాస్తూ చేసుకోవచ్చని తెలిపారు. (Story : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!