Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌స్నేహ పూర్వకమైన పోటీలు అలవర్చు కోవాలి

స్నేహ పూర్వకమైన పోటీలు అలవర్చు కోవాలి

స్నేహ పూర్వకమైన పోటీలు అలవర్చు కోవాలి

టిడిపి నాయకులు జింకా పురుషోత్తం

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఆట పోటీలు స్నేహపూర్వకమైన వాతావరణంలో జరిగితే క్రీడల పట్ల ప్రతి ఒక్కరికి ఉత్సాహం నెలకొంటుందని టిడిపి నాయకులు జింకా పురుషోత్తం పేర్కొన్నారు. సందారాఘవ, సోదరుడు సందా రవి సహకారంతో నిర్వహిస్తున్న ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ గురువారం రెండో రోజుకు చేరుకుంది. క్రికెట్ టోర్నీలో ఐదు జట్లు పాల్గొన్నాయి. మొదటగా ఎంజీ వారియర్స్ వర్సెస్ బిగ్ డాడీస్ జట్ల మధ్య పోటీ నిర్వహించగా ఎంజి వారియర్స్ మొదట బ్యాటింగ్ చేసి 87 పరుగులు సాధించగా తర్వాత దిగిన బిగ్ డాడి జట్టు 88 పరుగులు సాధించింది. బిగ్ డాడీ జట్టు విజయాన్ని అందుకుంది. అనంతరం సంజయ్ నగర్ వర్సెస్ ఎర్రగుంట్ల జట్ల మధ్య పోటీ నిర్వహించగా సంజయ్ నగర్ జట్టు మొదటి బ్యాటింగ్ చేసి 70 పరుగులు సాధించగా ఎర్రగుంట జట్టు 71 పరుగులు సాధించింది. ఎర్రగుంట జట్టు విజయకేతనం ఎగరవేసింది. తర్వాత మారుతి నగర్ వర్సెస్ కత్తెకొట్టాల జట్ల మధ్య పోటీ నిర్వహించగా మారుతి నగర్ జట్టు 95 పరుగులు సాధించగా కట్టే కట్టాల జట్టు 77 పరుగులు సాధించింది . మారుతి నగర్ జట్టును విజేతగా ప్రకటించారు. ఈ టోర్నీ తర్వాత గరుడంపల్లి వర్సెస్ సీనియర్స్ జట్ల మధ్య పోటీ నెలకొనగా గరుడంపల్లి జట్టు 67 పరుగులు సాధించగా సీనియర్స్ జట్టు 68 పరుగులు సాధించి విజేతగా నిలిచింది. అనంతరం డివైన్ వర్సెస్ టి పి ఆర్ జట్ల మధ్య పోటీ నిర్వహించగా మొదట బ్యాటింగ్ దిగిన డివైన్ జట్టు 108 పరుగులు సాధించగా టిపిఆర్ జట్టు కేవలం 76 పరుగులు సాధించింది. ఇందులో డివైన్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఈ కార్యక్రమంలో విశ్వనాథ్, తిరు ఫిరోజ్, టోర్నీ నిర్వాహకులు భరత్, సాయినాథ్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. (Story : స్నేహ పూర్వకమైన పోటీలు అలవర్చు కోవాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!