Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే చొర‌వ‌తో పుష్‌కార్ట్స్ పున‌రుద్ధ‌ర‌ణ‌

ఎమ్మెల్యే చొర‌వ‌తో పుష్‌కార్ట్స్ పున‌రుద్ధ‌ర‌ణ‌

0

ఎమ్మెల్యే చొర‌వ‌తో పుష్‌కార్ట్స్ పున‌రుద్ధ‌ర‌ణ‌

న్యూస్‌తెలుగు/ వినుకొండ‌ : మున్సిపాలిటీలో పాడైపోయిన పుష్ కార్ట్స్ వల్ల పారిశుధ్య కార్మికులు పడుతున్న అవస్థల్ని తొలిగించడానికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచన మేరకు మునిసిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ పాడైన పుష్ కార్ట్స్ ని తయారు చేయించి పునరుద్ధరించబడిన పుష్ కార్ట్స్ ని పారిశుధ్య కార్మికులకు సోమవారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమన్ని పురస్కరించుకొని కమీషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ. ఇప్పటివరకు 25 పుష్కార్ట్స్ పునరుద్ధరించబడ్డాయని, ఇంకనూ గుర్తించిన 28 పుష్కార్ట్స్ ని త్వరలో రిపేరు చేయించి ఇచ్చెదమని తెలిపారు. పట్టణ ప్రజలు మరియు వ్యాపారస్తులు భారతీయ నిబంధనలు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ నియమాలు 2016 ప్రకారం
వ్యర్థాలను బయోడిగ్రేడబుల్, నాన్-బయోడిగ్రేడబుల్ మరియు ప్రమాదకరములుగా మూడు వర్గాలుగా విభజించి తమ ఇంటినుండి వ్యాపార సముదాయాల నుండి వచ్చు చెత్తను విధిగా తడిచెత్తగా, పొడిచెత్తగా, ప్రమాదకర చెత్తగా మూడు విభాజితాలుగా మీరు చేయాలని, ఇందువలన తడిచెత్తను వర్మికంపోస్ట్ తయారు చేయటానికి మరియు ఐ.ఎస్.డబల్.ఎం. నందు విండ్రోజ్ పద్ధతి ద్వారా ఎరువు తయారు చెయ్యడానికి వినియోగిస్తామని తెలిపారు. పొడిచెత్తను వేరు చేసి ఇవ్వడం వల్ల పునర్వినియోగపరచదగిన వస్తువులను వేరుచేసి వాటి అమ్మకము వల్ల మునిసిపల్ కార్యాలమునకు ఆర్థిక స్వావలంబన కలుగుతుందని తెలిపారు. ప్రమాదకర చెత్తను వేరుచేసి ఇవ్వడంవల్ల ఆ చెత్తను గుంటూరు వద్దనున్న జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నకు పంపించడం జరుగుతుందని తెలిపారు. తద్వారా పట్టణం చెత్త రహితంగా పరిపూర్ణంగా తీర్చిదిద్దుటకు సహకరించాలని కమీషనర్ ప్రజలను కోరారు. (Story : ఎమ్మెల్యే చొర‌వ‌తో పుష్‌కార్ట్స్ పున‌రుద్ధ‌ర‌ణ‌)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version