Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌భారీ వర్ష బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది... పరిటాల శ్రీరామ్

భారీ వర్ష బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది… పరిటాల శ్రీరామ్

భారీ వర్ష బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది… పరిటాల శ్రీరామ్

ధర్మవరం పట్టణంతో పాటు రూరల్ ప్రాంతాల్లో శ్రీరామ్ పర్యటన

వర్షం కారణంగా నష్టపోయిన బాధితులకు పరామర్శ.

ధర్మవరం నియోజకవర్గంలో వర్షాల కారణంగా చాలా నష్టం జరిగింది

అధికారులు అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టారు

న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : భారీ వర్షం కారణంగా ధర్మవరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టం జరిగిన ప్రాంతాల్లో శ్రీరామ్ పర్యటించారు. ధర్మవరం పట్టణంలోని పార్థసారథి నగర్, దుర్గా నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో శ్రీరామ్ పర్యటించారు. మున్సిపల్ కమిషనర్ తో కలసి వర్షం కారణంగా జరిగిన నష్టాన్ని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల చెట్లు కూలి ఇళ్లపై పడటంతో చాలా ఎక్కువ నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. మరోవైపు మగ్గం గుంతల్లోకి నీరు వచ్చి వేల రూపాయలు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మవరం మండలం ఓబులనాయునిపల్లి గ్రామానికి చెందిన రైతు కొల్లా ఆదెప్ప భూమిలో కరెంట్ ట్రాన్స్ ఫార్మర్ మరియు స్తంభాలు రాత్రి కురిసిన వర్షానికి నేలకూలగా వాటిని పరిశీలించారు. విద్యుత్ అధికారులకు మాట్లాడి వాటిని వెంటనే పునరుద్ధరించాలన్నారు. నడిమిగడ్డపల్లి గ్రామానికి చెందిన రైతు అప్పానాయక్ కు సంబంధించిన దాదాపు 5 ఎకరాల్లోని ద్రాక్ష తోట మరియు పంట కోసం ఉపయోగించే రాళ్లు మొత్తం పడిపోగా.. శ్రీరామ్ బాధిత రైతును పరామర్శించి 50వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి ధైర్యంగా ఉండాలని నష్టపరిహారం గురించి ప్రభుత్వంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. అలాగే ధర్మవరం చెరువు భారీ వర్షాలకు మరువ పారుతుండటంతో… అక్కడ స్థానిక టిడిపి నాయకులతో కలిసి గంగ పూజ చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ భారీ వర్షాలకు ధర్మవరం చెరువు నిండడం సంతోషమే అయినప్పటికీ.. గత రాత్రి కురిసిన వర్షాలకు అపార నష్టం, ఆస్తి నష్టం వాటిలిందన్నారు. ధర్మవరం రూరల్ ప్రాంతంతో పాటు ముదిగుబ్బ ప్రాంతంలో పెద్ద ఎత్తున పంటలకు నష్టం జరిగిందన్నారు. ధర్మవరం పట్టణంలో చేనేతలు కూడా పెద్ద ఎత్తున నష్టపోయారన్నారు. ఇప్పటికే కమిషనర్ సచివాలయ సిబ్బందిని అప్రమత్తం చేసి నష్టాన్ని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఇంకా వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.(Story:భారీ వర్ష బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది… పరిటాల శ్రీరామ్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!