Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఇంటి కొరకు మాత్రమే ఉచిత ఇసుక 

ఇంటి కొరకు మాత్రమే ఉచిత ఇసుక 

0

ఇంటి కొరకు మాత్రమే ఉచిత ఇసుక 

ఆర్డిఓ మహేష్

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో ఎద్దుల బండి వాళ్లు ఉచితంగా ఇసుక రవాణా చేసుకునేందుకు అనుమతి ఉండెను. ఇందులో భాగంగానే ట్రాక్టర్ లో కూడా ఉచితంగా ఇసుకను తీసుకొని వెళ్ళుటకు అనుమతి కలదని ఆర్డిఓ మహేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కేవలం ఇల్లు కట్టుకొని యజమాని ఆధారంగా చేసుకొని యజమాని ద్వారానే ట్రాక్టర్లో ఉచిత ఇసుకను తీసుకొని వెళ్ళుటకు అనుమతి కలదని, ట్రాన్స్పోర్ట్ ఖర్చు మాకు సంబంధం లేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణం చేపట్టేందుకే ప్రభుత్వం ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తోందని వారు గుర్తు చేశారు. సొంత ఇంటి నిర్మాణానికి మాత్రమే ఇసుకను ఉపయోగించాలని, అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. అది కూడా ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే అనుమతించబడునని, టిప్పరకు ఎటువంటి పరిస్థితుల్లో అనుమతి లేదని వారు స్పష్టం చేశారు. తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలలో సీసీ రేవు, పిసి రేవు వద్ద నుండి ఉచితంగా ఇసుకను పొందే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఈ ఉచిత ఇసుక పంపిణీ చట్టపరంగా, ప్రభుత్వం నిర్ణయించిన షరతులు మేరకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. (Story : ఇంటి కొరకు మాత్రమే ఉచిత ఇసుక )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version