రక్తదానం చేసిన యువకులకు పత్రాలు
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్తెలుగు/వనపర్తి : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నాగ వరం దగర మరియు వనపర్తి పట్టణంలో మాజీ మంత్రి నివాసం దగ్గర 120 మంది యువకులు రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం చేసిన యువకులకు పత్రాలు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతులమీదుగా ఇవ్వడం జరిగింది. నాగవరానికి చెందిన మాండ్ల జ్ఞానేశ్వర్ అనే యువకుడు, శ్రీ వినాయక వీల్ అలాట్మెంట్ సర్వీసింగ్ సెంటర్ మారికుంట దగర షాప్ పెట్టిన సందర్భంగా, యువకుని మాజీ మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి నందిమల అశోక్ , మాజీ సర్పంచ్ లు ,సుధాకర్, గౌడ నాయక్,సింగిల్ విండో డైరెక్టర్ చిన్నారెడ్డి , సయ్యద్ జమ్మెల్,10 వార్డు, నాగవరం, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దముక్కుల రవికుమార్ , బీసీ సెల్ ఉపాధ్యక్షులు వెంకటేష్ గౌడ్ , మండ్ల మన్యం, కేశవులు వెంకటయ్య, సూర్య వంశం గిరి పట్టణ యూత్ అధ్యక్షులు చిట్యాల రామ్, జోహెబ్ హుసేన్, యువకులు, యాదగిరి, కార్తీక్, భాస్కర్, వినోద్, మూర్తి, అంజి, మహేష్, శ్రీను, వంశీ, తదితర యువకులు గ్రామంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (Story : రక్తదానం చేసిన యువకులకు పత్రాలు)