Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మద్యం షాపులకు టెండర్లు వేసుకోండి

మద్యం షాపులకు టెండర్లు వేసుకోండి

మద్యం షాపులకు టెండర్లు వేసుకోండి

నియోజకవర్గ వ్యాప్తంగా 20 మద్యం దుకాణాలు

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని మద్యం షాపులకు టెండర్లు వేసుకోవాలని ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ చంద్రమణి తెలిపారు. స్థానిక ఎక్సైజ్ పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ చంద్రమణి మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా 20 మద్యం దుకాణాలలో ధర్మవరం అర్బన్-10, రూరల్-2, బత్తలపల్లి-3, తాడిమర్రి-1, ముదిగుబ్బ-4 మద్యం దుకాణాలు ప్రభుత్వం కేటాయించిందన్నారు. వాటికి టెండర్లను వేసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. ఈనెల 9వతేది సాయంత్రం 5గంటల్లోపు టెండర్లు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా వేసుకోవచ్చని తెలిపారు. ఒక్కో టెండర్కు రూ.2లక్షలు చలానా, డీడీ రూపంలో టోకన్ చెల్లించి టెండర్లు వేయాలన్నారు. ఒక ఆధార్కార్డు జిరాక్స్, రెండు ఫోటోలు, డీడీతో వచ్చి టెండర్లు వేసుకోవాలన్నారు. ఒక్కో వ్యక్తి ఎన్ని టెండర్లు అయినా వేసుకోవచ్చని తెలిపారు. ఒక్కో టెండర్కు టోకన్ రూ.2లక్షలు టెండరు దక్కినా, దక్కకపోయినా వాపసు రాదన్నారు. టెండరు దక్కించుకున్న వారికి రెండేళ్ల కాలపరిమితికి సంబంధించి లైసెన్సు ఫీజు రూ.65 లక్షలు ఆరు విడతలుగా కట్టాలన్నారు. బత్తలపల్లి, తాడిమర్రి మండలాలకు లైసెన్సు ఫీజు రూ.55 లక్షలుగా నిర్ణయించారని తెలిపారు. స్వచ్చంధంగా ప్రజలు టెండర్లు వేసుకోవచ్చన్నారు. భయాందోళనలకు జీవరూ గురికాకూడదని ఎవరైనా బెదిరిస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఒక్కో దుకాణానికి దాదాపు 30 టెండర్లు వేయించేలా ప్రభుత్వం టార్గెట్ పెట్టిందని తెలిపారు. టెండర్లు వేయాలనుకునేవారు ధైర్యంగా వచ్చి వేసుకోవచ్చని సూచించారు. టెండర్లను లాటరీ పద్ధతిలో ఈనెల 11వతేదిన పుట్టపర్తిలోని శ్రీసాయిఆరామంలో జిల్లా కలెక్టర్ లాటరీ తీస్తారని ఎవరికి లాటరీలో పేరు వచ్చిందో వారికి మద్యం దుకాణం దక్కుతుందన్నారు. ఎక్సైజ్ స్టేషన్లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫమావేశంలో ఎక్సైజ్ ఎస్ఐలు నాగరాజు, చాంద్బాషాలు పాల్గొన్నారు. (Story : మద్యం షాపులకు టెండర్లు వేసుకోండి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!