Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు

అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు

అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శరణ్య రాత్రుల మహోత్సవ వేడుకలు ఈవో వెంకటేశులు, భక్తాదులు, అర్చకులు నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారు మూడవ రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అలంకరణలో భక్తాదులకు దర్శనమిచ్చారు. శాశ్వత వంశపారంపర్య ఉభయ దాతలు జగ్గా వంశీయులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

పట్టణంలోని దుర్గమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల మహోత్సవ వేడుకలు ఆలయ ఈవో వెంకటేశులు, భక్తాదులు నడుమ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడవ రోజున అమ్మవారు రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. దాతలు భక్తాదుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.

పట్టణములోని శ్రీనివాస నగర్ (గుడ్డి బావి వీధిలో) గల శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయములో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు మూడవ రోజున స్వామి వారు వరాహ అవతార అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు రాజేష్ ఆచార్యులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్, చెన్నం శెట్టి రమేష్ కుమార్, జింక రాజేంద్రప్రసాద్, చెన్నం శెట్టి శ్రీనివాసులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. (Story : అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!