వివిధ రూపాల అలంకరణలో భక్తాదులకు దర్శనం
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణంలోని వాసవి గుడి, తొగట వీధిలోని శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయం, లక్ష్మీ నగర్ లోని శ్రీ చౌడేశ్వరి ఆలయంలో భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. ఇందులో భాగంగా పట్టణంలోని కెపిటివీధిలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడవ రోజున అమ్మవారు ఉదయం మోహినీ దేవి అలంకరణ సాయంత్రం రాజ రాజేశ్వరి దేవి అలంకరణ లో భక్తాదులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జూటూరి రమణయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ గుప్తా కార్యదర్శి తబ్జుల శ్రీనివాసులు కోశాధికారి పిన్ను అశోక్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ పిన్ను శ్రీనివాస ప్రసాద్ తో పాటు అనుబంధ సంఘం ఆర్యవైశ్యులు, భక్తాదులో పాల్గొన్నారు.
పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయంలో ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు బంధనాథం వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి సిరివెళ్ల రాధాకృష్ణ ,కోశాధికారి వెంకటేశులు, (చిట్టి) తదితర సభ్యుల ఆధ్వర్యంలో శరన్నవరాత్రుల 41 వ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మూడవ రోజున అమ్మవారు పద్మావతి దేవి అలంకరణలో దర్శనమిచ్చారు.
పట్టణంలోని లక్ష్మీ నగర్ రాజేంద్రనగర్ లో గల శ్రీ రాజ్యలక్ష్మి చౌడేశ్వరి దేవి ఆలయంలో కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రుల మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మూడవ రోజున అమ్మవారు పార్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తాదులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. (Story : వివిధ రూపాల అలంకరణలో భక్తాదులకు దర్శనం)