Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఉచిత ఇసుక హామీలు అమలు చేయండి

ఉచిత ఇసుక హామీలు అమలు చేయండి

ఉచిత ఇసుక హామీలు అమలు చేయండి

సిపిఎం, సిఐటియు నాయకులు డిమాండ్

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక పాలసీను అమలు చేస్తామన్న హామీలు నిలబెట్టాలని సిపిఎం జిల్లా నాయకులు పెద్దన్న ఎస్హెచ్ భాష, సీఐటీయూ నాయకులు జెవి రమణ, అయూబ్ ఖాన్, ఆదినారాయణ, రవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మహేష్ కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మార్కెట్ యార్డులో ఇసుక రీచ్ ను ఏర్పాటు చేయాలని, గృహ నిర్మాణం చేస్తున్న ప్రజలందరికీ ఇసుక అందుబాటులో ఉండే విధంగా కార్మికులకు పని కల్పించే విధంగా వెంటనే చర్యలు గైకొనాలని తెలిపారు. ఇసుక ట్రాక్టర్లకు ప్రజలు ఇబ్బందులు లేకుండా బాడుగలు ఉండేటట్లు చర్యలు చేపట్టాలని, ఇసుక దందాను వెంటనే అరికట్టాలని తెలిపారు.

ధర్మవరంలో లేబర్ ఆఫీస్ ఏర్పాటు చేయండి;; ధర్మవరం పట్టణంలో లేబర్ ఆఫీసును ఏర్పాటు చేయాలని ఆర్డీవో మహేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జేవి రమణ, పెద్దన్న ఎస్హెచ్ భాష, ఆయుఃఖాన్ మాట్లాడుతూ గతంలో ధర్మవరంలో లేబర్ ఆఫీస్ ఉండేదని, జిల్లా ఏర్పాటు జరిగిన తర్వాత కొత్తచెరువుకు బదిలీ చేయడం సరైన పద్ధతి కాదని తెలిపారు. అధికారులకు, కలెక్టర్కు పలుమార్లు విన్నవించుకున్న ఫలితం లేదని వారు బాధని వ్యక్తం చేశారు. ధర్మవరంలో 50 వేల మంది కార్మికులు ఉన్నారని ఈ కార్మికులకు లేబర్ ఆఫీసు తప్పనిసరిగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేబర్ ఆఫీస్ ఏర్పాటు చేయని యెడల సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. (Story : ఉచిత ఇసుక హామీలు అమలు చేయండి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!