Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వ్యాసరచన పోటీల నిర్వహణ

వ్యాసరచన పోటీల నిర్వహణ

వ్యాసరచన పోటీల నిర్వహణ

వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ రెడ్డి

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు నందుగల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు స్వచ్ఛత పక్షోత్సవాలలో భాగంగా కళాశాల నందు వ్యాసరచన పోటీలను నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ రెడ్డి,కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ స్వచ్ఛత పక్షోత్సవాలలో భాగంగా కళాశాల నందు తమ జీవితంలో తాము విలువనిచ్చే అత్యంత విలువైన వస్తువు అనే అంశం మీద వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు.అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు గాంధీ జయంతి నాడు బహుమతులను ప్రధానం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మరియు ఎన్ ఎస్ ఎస్ పి ఓ హర్షవర్ధన్, కళాశాల ఏవో రమేష్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.  (Story : వ్యాసరచన పోటీల నిర్వహణ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!