తెలంగాణ ఉద్యమాన్నికి ఆదిగురువు కొండా లక్ష్మణ్ బాపూజీ
న్యూస్తెలుగు/ వనపర్తి : కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వజయంతి సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు బిఆర్ఎస్ పార్టీ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ
జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ , బిఆర్ఎస్ పార్టీ
జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్నికి పునాది ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. తెలంగాణ లక్ష్యంగా ఆయన ఉద్యమాలు నిర్మించారని తెలంగాణ వచ్చేదాకా నేను పదవులు చేపట్టను అని మంత్రి పదవి త్యాగం చేసిన ధన్యజీవి కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. తెలంగాణ సామాజిక వర్గంలో సమిష్టి ఉద్యమాల ద్వారా ప్రజా సంక్షేమం కోసం కృషి చేశారని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు సాధించడానికి మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో అధ్యక్షులు పి.రమేష్ గౌడ్,మార్కు ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్, నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి, జాతృ నాయక్,కౌన్సిలర్స్ నాగన్న యాదవ్, కంచె.రవి,గులాం ఖాదర్ ఖాన్, నీల స్వామి,ప్రేమ్ నాథ్ రెడ్డి,ఎం.డి.గౌస్,మహేశ్వర్ రెడ్డి, జో హెబ్ హుస్సేన్,చిట్యాల.రాము, సిరిగిరీ.మన్నెం,A.K.పాషా,అరీఫ్,యుగంధర్ రెడ్డి, సిరివాటి. శంకర్ మాజీ మార్కెట్ డైరెక్టర్ శ్రీను,మహేష్ చారి,తోట.శ్రీను తదితరులు పాల్గొన్నారు. (Story :తెలంగాణ ఉద్యమాన్నికి ఆదిగురువు కొండా లక్ష్మణ్ బాపూజీ)