UA-35385725-1 UA-35385725-1

రక్తదానం మరొకరికి ప్రాణదానం 

రక్తదానం మరొకరికి ప్రాణదానం 

ప్రిన్సిపాల్ ప్రశాంతి, హెడ్మాస్టర్ శైలజ.

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : రక్తదానం మరొకరికి ప్రాణదానమవుతుందని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ శైలజ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో హలో ధర్మవరం సోషల్ మీడియా నిర్వాహకులు ప్రదీప్ ఆధ్వర్యంలో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రక్తదాన శిబిరమును నిర్వహించిన ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రదీప్ మాట్లాడుతూ మా హలో ధర్మవరం సోషల్ మీడియా నాలుగు సంవత్సరాలు వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, ఈ శుభ సందర్భాన తాము మొట్టమొదటిసారిగా ఈ రక్తదాన శిబిరమును నిర్వహించుట మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ శిబిరంలో మొత్తం 23 మంది రక్తదానం చేయడం జరిగిందని, ఈ రక్తపు ప్యాకెట్లను (23 యూనిట్లు) అనంతపురం, ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇటువంటి రక్త శిబిరాలు అందరికీ స్ఫూర్తినిస్తాయని, రక్తదానం చేయుటలో అపూహలు మానుకోవాలని తెలిపారు. ఈ రక్త దానం ఎంతోమంది ప్రాణాలను కాపాడగలుగుతుందని తెలిపారు. అనంతరం హలో ధర్మవరం సోషల్ మీడియా వారిని వారు అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశులు, శ్రీహరి, కౌన్సిలర్ కేతా లోకేష్, కన్నా వెంకటేష్, పోతులయ్య, డిసివిసి క్లబ్ వారు పాల్గొన్నారు. (Story : రక్తదానం మరొకరికి ప్రాణదానం )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1