Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వృద్ధులకు వైద్య సేవలు మరింత విస్తరింప చేస్తాం

వృద్ధులకు వైద్య సేవలు మరింత విస్తరింప చేస్తాం

0

వృద్ధులకు వైద్య సేవలు మరింత విస్తరింప చేస్తాం

అవార్డు గ్రహీత డాక్టర్ సత్య నిర్ధారన్

న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణ గ్రామీణ ప్రాంతాలలో ఉండే వృద్ధులకు మరింత వైద్య చికిత్సలను విస్తరింప చేస్తామని అవార్డు గ్రహీత డాక్టర్ సత్య నిర్ధారన్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని మెహర్ బాబా సెంటర్లో మెహర్ బాబా ప్రేమికులు, కమిటీ వారు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపూర్ నుంచి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ నరసింహ పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ సత్య నిర్ధారణను మెహర్ బాబా వారు ఘనంగా అభినందిస్తూ సత్కరించారు. తదుపరి ముఖ్యఅతిథి నరసింహ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలలో భవిష్యత్తులో మరింత పటిష్టంగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం డాక్టర్ సత్య నిర్ధారన్ మాట్లాడుతూ వృద్ధుల కోసం ప్రత్యేకంగా ప్రతి వారం గత పది సంవత్సరాలుగా వృద్ధుల వైద్య శిబిరం నిర్వహించడం మెహర్ బాబా ప్రేమికుల గొప్పతనం అని వారు కొనియాడారు. తదుపరి సత్య నిర్ధారణ రూపొందించిన స్వచ్ఛంద సంస్థల ఆరోగ్య ప్రణాళికల కరపత్రం సుజాత ద్వారా ఆవిష్కరించారు. తదుపరి వృద్ధులందరికీ మానసిక ఉల్లాసాన్ని కలిగించే విధంగా కార్తీక్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, వెంకటేశు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. (Story : వృద్ధులకు వైద్య సేవలు మరింత విస్తరింప చేస్తాం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version