దోషులను కఠినంగా శిక్షించాలి
న్యూస్ తెలుగు /ములుగు : ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో గత నెల 31న,ఆదివాసీ మహిళ మెస్త్రం నీలా బాయి పై,జరిగిన అత్యాచార హత్యకు నిరసనగా,ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా కమిటి (తుడుండెబ్బ)ఆధ్వర్యంలో శనివారం తుడుం దెబ్బ నాయకులు ఐటీడీఏ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అత్యాచార హత్య నిందితులను,ముస్లిం షేక్ ముకుండం ను,పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి, కఠినంగా శిక్షించాలని, రాష్ట్ర గవర్నర్ చొరవ తీసుకుని అరెస్టు చేయాలని,రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇట్టి కార్యక్రమంలో తుడుండెబ్బ రాష్ట్ర, జిల్లా నాయకులుఆలం కిషోర్, జిల్లా అధ్యక్షులు పులిసే బాలకృష్ణ,వైస్ చైర్మన్ పొడెం బాబు,జిల్లా అధ్యక్షులు వట్టం జనార్దన్, విద్యార్థి సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎసై తాజోద్దీన్, దగ్గర ఉండి బందోబస్తు ఏర్పాటు చేశారు. (Story : తుడుం దెబ్బ దోషులను కఠినంగా శిక్షించాలి)