చేనేత ప్రముఖులు జింక రామాంజనేయులు కు ఉత్తమ చేనేత అవార్డు!
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణం చేనేత రంగానికి చెందిన పట్టణ ప్రముఖులు జింక రామాంజనేయులు కు సెంట్రల్ సిల్క్ బోర్డ్ కేంద్ర ప్రభుత్వం వారిచే ఉత్తమ సేవా పురస్కారం లభించింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సెంట్రల్ సిల్క్ బోర్డ్ కుమారస్వామి తదితరులు పాల్గొన్న సమావేశంలో, సెంట్రల్ సిల్క్ బోర్డు ప్లాటినం జూబ్లీ వార్షికోత్సవాల సందర్భంగా చేనేత రంగంలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను బెస్ట్ వీవర్ ఉత్తమ అవార్డును బిజెపి చేనేత నాయకులు జింక రామాంజనేయులు కు లభించింది. జింక రామాంజనేయులు కు ఈ అవార్డు లభించడం పట్ల పలువురు చేనేత మిత్రులు ప్రముఖులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. (Story : చేనేత ప్రముఖులు జింక రామాంజనేయులు కు ఉత్తమ చేనేత అవార్డు!)