అర్ధరాత్రి మహిళా హంగామా
నడిరోడ్డుపై బైఠాయించిన మహిళ
అందరిపై దురుసు గా ప్రవర్తన
న్యూస్తెలుగు/ కొమురం భీం జిల్లా : కాగజ్ నగర్ పట్టణం ఎన్టీఆర్ చౌరస్తా వద్ద శుక్రవారం రాత్రి ఓ మహిళ హంగామా చేసింది. మొబైల్ ఫోన్ ను అందరికీ చూపిస్తూ తన వీడియోస్ లీక్ అయ్యే అంటూ కొద్దిసేపు హల్చల్ చేసింది. తన భర్తతో కలిసి వచ్చిన మహిళ చౌరస్తాలోని వైన్ షాప్ కు వెళ్లి మందు బాటిల్ సైతం పగులగొట్టి వారి పై తిట్టి పోసింది. మహిళ ప్రవర్తనను చూసి అక్కడున్న వారంతా బిత్తర పోయారు. అక్కడికి వచ్చిన పోలీసులను సైతం ఇష్టం వచ్చినట్లు బూతు పురాణం చదివింది. రోడ్డుపై వెళ్తున్నా వాహనాలకు అడ్డుగా నిలవడంతో అంతలోనే వచ్చిన ఓ కారు ఆమెను ఢీ కొట్టింది. దీంతో ఆ మహిళను పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రేష్మ మహిళ వేంపల్లి గ్రామానికి చెందినదిగా అక్కడున్నవారు చెప్పుకొచ్చారు. అసలు విషయం తెలియాల్సి ఉంది. (Story : అర్ధరాత్రి మహిళా హంగామా)