Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సీతం కళాశాలలోఎంబీఏ, ఎంసీఏ కోర్సులు ప్రారంభం

సీతం కళాశాలలోఎంబీఏ, ఎంసీఏ కోర్సులు ప్రారంభం

0

సీతం కళాశాలలోఎంబీఏ, ఎంసీఏ కోర్సులు ప్రారంభం

న్యూస్‌తెలుగు/ విజయనగరం : విజయనగరం  స్థానిక గాజుల రేగ పరిధిలోగల సీతం కళాశాలలో శుక్రవారం మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స
(ఎంసీఏ) కోర్సులను ప్రారంభించి వాటి యొక్క వివరాలను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్‌టీయూజీవీ ప్రిన్సిపాల్‌, అకడమిక్స్‌ అండ్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.రాజేశ్వర రావు విచ్చేసారు. ఈ సందర్భంగా. ఆయన మాట్లాడుతూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు విధ్యార్దుల మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్, అకౌంటింగ్ మరియు మానవ వనరులు వంటి ప్రధాన వ్యాపార రంగాలపై సమగ్ర అవగాహన పొందవచ్చునన్నారు. వ్యాపార సమస్యలను విశ్లేషించడానికి, డేటాను అర్థం చేసుకోవడానికి మరియు పరిమాణాత్మక, గుణాత్మక పద్ధతులను ఉపయోగించి సమాచార నిర్ణయాలు తీసుకునే విద్యార్థులకు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ కోర్సులు ఉపయోగపడుతుందన్నారు.
కళాశాల డైరెక్టర్ డా॥ మజ్జి శశిభూషణ రావు మాట్లాడుతూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ద్వారా విద్యార్దులకు వ్యాపారానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడం, ప్రాజెక్ట్‌లను నిర్వహించడం మరియు వివిధ వ్యాపార సందర్భాలలో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం వంటి నైపుణ్యాలను కోర్సు ద్వారా సీతం కళాసాల లో నేర్చుకోవచ్చన్నారు.
ప్రిన్సిపల్ డా॥ ద్వివేదుల రామమూర్తి మాట్లాడుతూ ఎంబీఏ, ఎంసీఏ అనంతరం విద్యార్దులకు లాజిస్టిక్స్, ప్రొక్యూర్‌మెంట్, సప్లై చైన్ కోఆర్డినేషన్‌ , ప్రపంచ వ్యాపార కార్యకలాపాల నిర్వహణ, ఎగుమతి/దిగుమతి కార్యకలాపాలు లేదా అంతర్జాతీయ మార్కెటింగ్‌ లలో ఉపాది అవకాశాలు పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో
డిపార్ట్మెంట్ ఆఫ్ మెనేజ్మెంట్ స్టడీస్ హెచ్.ఓ.డీ డా॥ యస్ వరూధి నీ, హెచ్.ఓ.డీ డా॥ రాధ, ఎంబీఏ, ఎంసీఏ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version