Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రజలు మెచ్చేలా కూటమి ప్రభుత్వ పాలన

ప్రజలు మెచ్చేలా కూటమి ప్రభుత్వ పాలన

ప్రజలు మెచ్చేలా కూటమి ప్రభుత్వ పాలన

జనసేన నేత గురాన అయ్యలు

న్యూస్‌తెలుగు/ విజయనగరం : కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలోఏపీ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని జనసేన నేత గురాన అయ్యలు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ ప్రజలు మెచ్చేలా కూటమి ప్రభుత్వ పాలన వుందన్నారు. 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి 100 రోజుల్లో ఎన్నో హామీలు అమలు చేసిందన్నారు. ఈ వంద రోజుల్లో రాష్ట్ర ప్రజలకు ప్రజా ప్రభుత్వం మళ్లీ ఓ నమ్మకాన్ని కలిగించిందన్నారు. రూ.3 వేల పింఛన్‌ను రూ.4 వేలకు కూటమి ప్రభుత్వం పెంచిందన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు, ఉచిత ఇసుక పాలసీ..ఇలా 100 రోజుల్లో ఎన్నో రకాల ఘనతలను ఎన్డీయే కూటమి ప్రభుత్వం సాధించిందన్నారు. కూటమి ప్రభుత్వంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!