నిర్మాణంలో వున్న ఇళ్లను మార్చిలోగా పూర్తిచేయాలి
గృహనిర్మాణ సంస్థ ఎం.డి. రాజాబాబు
న్యూస్తెలుగు/ విజయనగరం : జిల్లాలో నిర్మాణం ప్రారంభించిన ఇళ్లన్నింటినీ మార్చి నెలాఖరులోగా శతశాతం పూర్తిచేయాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎం.డి. పి.రాజాబాబు హౌసింగ్ ఇంజనీర్లను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలను ఒక దశ నుంచి మరో దశకు నిర్ణీత కాలవ్యవధి ప్రకారం పూర్తిచేయాలని స్పష్టంచేశారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎం.డి. రాజాబాబు గురువారం జిల్లాలో పర్యటించారు. విజయనగరం పట్టణ పరిధిలో గుంకలాంలోని ఇళ్ల కాలనీని సందర్శించి ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. నెల్లిమర్లలోని జరజాపుపేట హౌసింగ్ కాలనీని సందర్శించి ఇంజనీర్లకు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి సూచనలు చేశారు. ఇళ్ల నిర్మాణంలో వున్న అవరోధాలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. గృహనిర్మాణ సంస్థ కార్యాలయంలో ఇ.ఇ.లు, డి.ఇ.లు, ఏ.ఇ.లతో ఇళ్లనిర్మాణంపై సమీక్షించారు. (Story : నిర్మాణంలో వున్న ఇళ్లను మార్చిలోగా పూర్తిచేయాలి)