చదురుగుడిలో చండీ హోమం
న్యూస్తెలుగు/విజయనగరం : పట్టణంలోని మూడు లాంతర్లు వద్ద ఉన్న పైడితల్లి అమ్మవారి చదురు గుడిలో మూడవ మంగళవారం పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో చండీ హోమం , పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ వేదపండితులు దూసి శివరాం శర్మ ముందు గా గణపతిపూజ, పుణ్యాహవచనం, హోమాది కార్యక్రమాలు పలువురు దంపతులచేనిర్వహించారు.ఆలయంలో అమ్మవారికి పూలాలంకరణలుచేసి పూజలు నిర్వహించి బూరెలు సమర్పించారు.అమ్మవారిని దర్శించుకునేందుకు విశాఖ పట్నం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం డిప్యూటీ కమిషనర్,ఇఓ కె.శ్రీనివాసరెడ్డిదంపతులు విచ్చేసారు.పైడితల్లి దేవస్థానం ఇఓ డివివి ప్రసాదరావు వారిని సాదరంగా ఆహ్వానించి అమ్మవారి దర్శనంఅనంతరం ఉచిత రీతిని సత్కరించి అమ్మవారి ఫోటో, ప్రసాదాలు అందజేశారు. పైడితల్లమ్మ వారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఉదయం నుండే దేవాలయం వద్దకు వచ్చేశారు. భక్తులకు ఆలయ అర్చకులు ఏడిద వెంకటరమణ, పూజారి బంటుపల్లి వెంకట్రావు, తాళ్లపూడి ధనుంజయ్ పూజలు నిర్వహించారు. ఎక్కడ అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. (Story : చదురుగుడిలో చండీ హోమం )