Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వైభవంగా శ్రీ పద్మావతి అమ్మ పవిత్రోత్సవాలు 

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మ పవిత్రోత్సవాలు 

0

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మ పవిత్రోత్సవాలు 

న్యూస్‌తెలుగు/తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటిరోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
   ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం ద్వారతోరణ ధ్వజకుంభ ఆవాహనం, చక్రాధి మండలపూజ, చతుస్థానార్చన, అగ్నిప్రతిష్ఠ, పవిత్రప్రతిష్ఠ నిర్వహించారు.
అనంతరం శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బనీళ్లతో, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ  డెప్యూటి ఈఓ శ్రీ గోవింద రాజన్, ఎఇఓ శ్రీ రమేష్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, సూపరింటెండెంట్‌ శ్రీ శేషగిరి, టెంపుల్‌ ఇన్స్‌పెక్టర్లు శ్రీ సుభాష్, శ్రీ గణేష్, తదితరులు పాల్గొన్నారు. (Story : వైభవంగా శ్రీ పద్మావతి అమ్మ పవిత్రోత్సవాలు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version