సీతం కళాశాల లో బీ.బీ.ఏ కోర్సు ప్రారంభోత్సవ వేడుకలు
న్యూస్తెలుగు/ విజయనగరం : స్థానిక గాజుల పరిధిలోగల సీతం కళాశాలలో శుక్రవారం బి బి ఏ కోర్సు ప్రారంభోత్సవ వేడుకలు విద్యార్థులకు కోర్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా॥కట్టమణి ( వైస్ ఛాన్సలర్ – కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం )
విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీ.బీ.ఏ కోర్సు ద్వారా విధ్యార్దులు మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్, అకౌంటింగ్, మానవ వనరులు వంటి ప్రధాన వ్యాపార రంగాలపై సమగ్ర అవగాహన పొందవచ్చునన్నారు. వ్యాపార సమస్యలను విశ్లేషించడానికి, డేటాను అర్థం చేసుకోవడానికి, పరిమాణాత్మక మరియు గుణాత్మక పద్ధతులను ఉపయోగించి సమాచార నిర్ణయాలు తీసుకునే విద్యార్థులకు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కోర్సు ఉపయోగపడుతుందన్నారు.
కళాశాల డైరెక్టర్ డా॥ మజ్జి శశిభూషణ రావు మాట్లాడుతూ బీబీఏ కోర్సు ద్వారా విద్యార్దులకు వ్యాపారానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడం, ప్రాజెక్ట్లను నిర్వహించడం, వివిధ వ్యాపార సందర్భాలలో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం వంటి నైపుణ్యాలను బీబీఏ కోర్సు ద్వారా సీతం కళాశాలలో నేర్చుకోవచ్చన్నారు. ప్రిన్సిపల్ డా॥ ద్వివేదుల రామమూర్తి మాట్లాడుతూ బీబీఏ తరువాత విద్యార్దులకు లాజిస్టిక్స్, ప్రొక్యూర్మెంట్ , సప్లై చైన్ కోఆర్డినేషన్ , ప్రపంచ వ్యాపార కార్యకలాపాల నిర్వహణ, ఎగుమతి/దిగుమతి కార్యకలాపాలు లేదా అంతర్జాతీయ మార్కెటింగ్ లలో ఉపాది అవకాశాలు పొందవచ్చునన్నారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ మెనేజ్మెంట్ స్టడీస్ హెచ్.ఓ.డీ డా॥ యస్ వరూధిణీ మాట్లాడుతూ బీబీఏ కోర్సు ద్వారా విద్యార్దులలో వ్యాపార నైపుణ్య అభివృద్ది కోసం బిజినెస్ కమ్యూనికేషన్ క్లబ్స్ , రోల్ ప్లేస్ , బిజినెస్ ఏక్టివిటీస్ , పారిశ్రామిక సందర్శనలు వంటి కార్యక్రమాలను కళాసాల నిర్వహిస్తాదన్నారు.
ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఉపాద్యాయులు, కళాసాల విద్యార్దులు పాల్గొన్నారు. (Story : సీతం కళాశాల లో బీ.బీ.ఏ కోర్సు ప్రారంభోత్సవ వేడుకలు)