Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌కామ్రేడ్ సీతారాం ఏచూరి కు సిపిఎం ఘనంగా నివాళులు

కామ్రేడ్ సీతారాం ఏచూరి కు సిపిఎం ఘనంగా నివాళులు

కామ్రేడ్ సీతారాం ఏచూరి కు సిపిఎం ఘనంగా నివాళులు

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : కామ్రేడ్ సీతారాం ఏచూరి కు సిపిఎం పార్టీ, సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎస్హెచ్ భాష, మారుతి, జేవి రమణ, పెద్దన్న, సిఐటియు నాయకులు అయ్యుప్కాన్ ఆదినారాయణ మాట్లాడుతూ సీతారాం ఏచూరి విద్యార్థి దశలోనే ఉద్యమంలోకి అడుగుపెట్టడం జరిగిందని, దేశంలోని ఎన్నో సమస్యలను పరిష్కరించడంలో వారికి వారే సాటి అని తెలిపారు. వారి ఆశయ సాధనాల కొరకు అందరూ కృషి చేయాలని తెలిపారు. మొక్కవోని దీక్షతో ఎర్రబాటలో అగ్ర భాగాన నిలిచిన యోధుడు అని తెలిపారు. ప్రజలు తోపాటు కార్మికుల మెప్పు పొందిన ప్రజా పోరాట యోధుడు సీతారాం ఏచూరి అని తెలిపారు. సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శిగా పార్టీకి సేవలు అందించిన పోరాట పటిమ కలిగిన వ్యక్తి తన జీవితం నిరంతరం ప్రజల, కార్మికుల, రైతుల, కష్టజీవుల పోరాటాలను నిర్వహించారని తెలిపారు. ఇటువంటి మహా పోరాట గనుడు అస్తమించడం సిపిఎం పార్టీకి కార్మిక వర్గానికి తీరని లోటు అని వారు బాధను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు వెంకటస్వామి హరి అంగన్వాడీ వర్కర్స్ నాయకులు చంద్రకళ ,దీన, వనజ, అరుణా, స్వర్ణలత వసుధాంజలి, మున్సిపాలిటీ కార్మిక సంఘం నాయకులు బాబు, ముకుంద, లక్ష్మీ, ఓబులేసు, టాటా ఏస్ యూనియన్ నాయకులు సుబ్రహ్మణ్యం, కుల్లయప్ప, ప్రభు తదితరులు పాల్గొన్నారు. (Story :కామ్రేడ్ సీతారాం ఏచూరి కు సిపిఎం ఘనంగా నివాళులు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!