Homeవార్తలుతెలంగాణవిద్య తో పాటు దేహదారుడ్యం ముఖ్యం

విద్య తో పాటు దేహదారుడ్యం ముఖ్యం

విద్య తో పాటు దేహదారుడ్యం ముఖ్యం

బుద్ధారం పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

న్యూస్‌తెలుగు/వనపర్తి : విద్యార్థులకు విద్యతో పాటు దేహదారుడ్యం ఎంతో ముఖ్యమని దేశదారుడ్యం క్రీడలతో సాధ్యమవుతుందని, విద్యార్థులు క్రీడలపై దృష్టిని సారించాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సూచించారు. గోపాలపేట మండలం బుద్ధారం గ్రామ ఉన్నత పాఠశాలను ఆయన గురువారం సందర్శించి పరిశీలించారు. పాఠశాలలో అన్ని గదులు శిథిలావస్థలో ఉన్నాయని వాటిని వెంటనే తొలగించి నూతన తరగతి గదుల నిర్మాణాలకు కావలసిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు అందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ శిథిలావస్థలో ఉన్న గదుల ను తొలగించేందుకు వెంటనే చర్యలు చేపడతామని తెలిపీ నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా ప్రగతిని తెలుసుకున్నారు. విద్యార్థులు ఈ దశ నుంచే క్రమశిక్షణ అలవర్చుకుంటే భవిష్యత్తు మార్గాలు సుగమనం అవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు పెద్దలు అచ్యుత రామారావు ,సత్యశీల రెడ్డి , పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story:విద్య తో పాటు దేహదారుడ్యం ముఖ్యం.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!