Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వరద బాధితుల సహాయార్థం 12 క్వింటాళ్ల బియ్యం

వరద బాధితుల సహాయార్థం 12 క్వింటాళ్ల బియ్యం

వరద బాధితుల సహాయార్థం 12 క్వింటాళ్ల బియ్యం

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నామాల శంకర్

న్యూ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : విజయవాడ వరద బాధితుల సహాయార్థం 12 క్వింటాళ్ల బియ్యాన్ని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నామాల శంకర్ ఆధ్వర్యంలో విజయవాడకు తరలించారు. పట్టణంలోని వన్స్టన్ పోలీస్ స్టేషన్ వద్ద రాత్రి వన్డేన్ సిఐ నాగేంద్రప్రసాద్ జెండా ఊపి బియ్యం వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం నామాల శంకర్ మాట్లాడుతూ వరద బాధితులకు సహాయం చేద్దాం, మానవత్వాన్ని చాటుకుందామని తెలిపారు. దాతలు, ప్రజలు ద్వారా నామాల గ్రామంతోపాటు ధర్మవరం పట్టణంలోని పలు వార్డుల్లోని ప్రజల సహకారంతో 12 క్వింటాళ్ల బియ్యాన్ని విజయవాడలోని వరద బాధితులకు నేరుగా వెళ్లి ఇంటింటికి అందించనున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పట్టణాధ్యక్షుడు బండి వెంకటేష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. (Story : వరద బాధితుల సహాయార్థం 12 క్వింటాళ్ల బియ్యం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!