Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూడాలని మంత్రి సత్యకుమార్ ఆదేశం

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలో గణేష్ నిమజ్జనం జరిగే చెరువు ప్రాంతాన్ని బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, మంత్రి సిబ్బంది, పోలీసువారితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కార్యాలయ ఇన్చార్జి హరీష్ కుమార్ నిమజ్జన ఏర్పాట్లు కు సంబంధించి వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించినట్లు ఆయన చెప్పారు. విగ్రహాలను తీసుకెళ్లే రోడ్డుల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని, విగ్రహాలు వెళ్లే మార్గంలో విద్యుత్ తీగలు తగలకుండా, అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు గట్టి సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నిమజ్జనం రోజు ప్రశాంతంగా జరిగే విధంగా పట్టణములోని వన్ టౌన్, టూ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు గట్టి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, వివిధ పోలీస్ స్టేషన్లో సిఐ,ఎస్ఐ లో పాల్గొన్నారు. (Story : గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!