Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవ ఎన్నిక

న్యూస్‌తెలుగు/విజ‌య‌వాడ: ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేశినేని శివనాథ్ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. అలాగే, ఏసీఏ ఇతర పదవులకూ కేశినేని శివనాథ్ ప్యానల్ ఎన్నిక కావ‌డం విశేషం. ఏసీపీ ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, కార్యదర్శిగా సానా సతీష్ ఎన్నికయ్యారు. ఏసీఏ జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్‌రాజు ఎన్నికయ్యారు. కోశాధికారిగా దండిమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌గా విష్ణుతేజ్ ఎన్నికయ్యారు. ఏసీఏ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావటం శుభపరిణామం. ఈ త‌ర‌హా ఎన్నిక ఇటీవ‌ల కాలంలో ఇదే ప్ర‌థ‌మం. ఏసీఏ గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా భ్ర‌ష్టుప‌ట్టిపోయిన విష‌యం తెల్సిందే. ఈసారైనా బాగుప‌డుతుందో లేదో వేచిచూడాలి. ఇదిలావుండ‌గా, ఏసీఏ తొలి నిర్ణయంగా సీఎం సహాయనిధికి రూ.కోటీ విరాళం ప్ర‌క‌టించారు. వరద బాధితుల సహాయార్థం ఏసీఏ తరపున రూ.కోటీ విరాళం ఇచ్చారు. అంతేగాకుండా, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో క్రికెట్‌కు వసతులు కల్పిస్తామ‌ని, ఇప్పటివరకు విశాక ఒక్కటే అంతర్జాతీయ మ్యాచ్‌లకు వేదికగా ఉంద‌ని, మంగళగిరి, కడపలోనూ అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగేలా కృషి చేస్తామ‌ని కొత్తగా ఎన్నికైన కేశినేని శివనాథ్ ప్ర‌క‌టించారు. (Story: ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవ ఎన్నిక)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!