Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌నాగావ‌ళి, వంశ‌ధార‌కు వ‌ర‌ద‌పోటు

నాగావ‌ళి, వంశ‌ధార‌కు వ‌ర‌ద‌పోటు

నాగావ‌ళి, వంశ‌ధార‌కు వ‌ర‌ద‌పోటు

ఉత్త‌రాంధ్ర అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసిన సీఎం

న్యూస్‌తెలుగు/అమ‌రావ‌తిః బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ఆయా జిల్లాల్లో పరిస్థితులపై జిల్లా కలెక్టర్లను, అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు. ముఖ్యంగా నాగావ‌ళి, వంశధార న‌దుల‌కు వ‌ర‌ద‌పోటు పెరుగుతోంద‌ని ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ప్ర‌స్తుత వ‌ర్ష ప్ర‌భావం ఎక్కువ‌గా ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఆరు జిల్లాల‌పై ప్ర‌భావం చూపుతున్న విష‌యాన్ని ఆయా అధికారులు గ‌మ‌నించాల‌ని హెచ్చ‌రించారు. సీఎం త‌న టెలీకాన్ఫ‌రెన్స్‌లో అంశాల వారీగా స‌మీక్ష చేశారు. అవేమిటంటే…

* జిల్లాల వారిగా నమోదైన వర్షపాతం వివరాలను టెలీకాన్ఫరెన్స్ లో సీఎంకు వివరించిన కలెక్టర్లు..

* తమ తమ జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలు, సన్నద్ధతను సీఎంకు వివరించిన కలెక్టర్లు..

* కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు సూచనలు..

* జిల్లాల్లో నమోదైన వర్షపాతాన్ని అంచనా వేసుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి..

* నేడు, రేపు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది..

* ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల ప్రభావం కనిపిస్తోంది..

* ఏలేరు రిజర్వాయర్ కు ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి..

* ప్రాజెక్టుల్లోకి వచ్చే ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో బ్యాలెన్స్ చేసుకుని సమర్థవంతంగా ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టాలి..

* కాలువలు, చెరువులు, డ్రెయిన్లకు గండ్లు పడకుండా చూసుకోవాలి..

* భారీ, అతిభారీ వర్షాలు పడేందుకు అవకాశం ప్రాంతాల్లో తాగునీరు, ఆహారం, మెడికల్ క్యాంప్ లకు సిద్ధంగా ఉండాలి..

* ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణనష్టం లేకుండా చూసుకోవాలి..

* ముందస్తు చర్యలతో ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చు..

* పంట నష్టం అంచనా, బాధితులకు ఆహారం సరఫరా, వరద పరిస్థితులను గమనించేందుకు డ్రోన్లు వినియోగించవచ్చు..

* పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి. వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలించాలి..

* పరిస్థితి తీవ్రతను బట్టి సహాయం కోసం సెంట్రల్ కంట్రోల్ టీంను సంప్రదించాలి..

* ఏజెన్సీలో భారీ వర్షాలు, వాగులు వంకల పరిస్థితిపై అధికారులు నిరంతరం సమాచారం తెప్పించుకోవాలి..

* ఎగువ ప్రాంతాల నుండి వరద వస్తే ఒక జిల్లా నుండి మరో జిల్లా అధికారులు సమన్వయం చేసుకోవాలి.

* వరద, భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్ లు పంపించాలి..

* వాగులు, వంకలు దాటే సమయంలో ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ఆంక్షలు విధించండి..

* వినాయకుని నిమజ్జనానికి కూడా వెళ్లి ప్రమాదం బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి..

* 2 వేల మందికి పైగా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించి, ఆహారం అందిస్తున్నామన్న ఏలూరు జిల్లా కలెక్టర్..

* విజయనగరం జిల్లాలో నిన్న, నేడు భారీ వర్షాలున్నాయని, దానికి అనుగుణంగా రాకపోకలను బ్రిడ్జిలపై నియంత్రిస్తున్నామని, ప్రజలకు అవసరమైన సమాచారం ఇస్తున్నామన్న విజయనగరం జిల్లా కలెక్టర్..

* నాగావళి, వంశధార నదులకు వరద పెరిగే అవకాశం ఉందన్న అంచనాలకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలి.

* బాపట్ల జిల్లాలో పునరావాస కేంద్రాల్లో పెరుగుతున్న బాధితుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్న జిల్లా కలెక్టర్..

* 8 రోజులుగా విజయవాడలో వరద పరిస్థితులు, ప్రజల కష్టాలను, సహాయ చర్యలను మీరు చూస్తున్నారు… దానికి తగ్గట్లుగా మీరు కూడా సిద్ధం చేసుకోవాలి.

* వరద బాధితులను ఆదుకునేందుకు జిల్లా స్థాయిలో తీసుకునే చర్యలకు అప్పటికప్పుడే నిధులు విడుదల చేస్తాం.. (Story : నాగావ‌ళి, వంశ‌ధార‌కు వ‌ర‌ద‌పోటు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!