రక్తదానం మరొకరికి ప్రాణదానం.. కన్నా వెంకటేష్.
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా):రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందని రజిని చారిటబుల్ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ నిర్వాహకులు కన్నా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజన్లోని రామగిరి మండలంలో రామగిరి యువత అంబేద్కర్ గారిని పెద్దలు యూనిట్ స్టార్స్ టీం సహకారంతో ఉచిత రక్తదాన శిబిరమును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కన్నా వెంకటేష్ మాట్లాడుతూ ఈ శిబిరంలో దాదాపు 50 మంది యువకులు పాల్గొని రక్తదానమును ఇవ్వడం జరిగిందన్నారు. ఆపదలో ఉన్నవారికి ఈ రక్తం ఎంతో ఉపయోగపడుతుందని, అదేవిధంగా తల సేమియా బాధితులు కూడా ఈ రక్తదానం ప్రాణం పోస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నరేష్, రామాంజనేయులు, నాగభూషణం, ఆంజనేయులు, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(Story:రక్తదానం మరొకరికి ప్రాణదానం.. కన్నా వెంకటేష్.)