ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించండి
ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి శ్రీనివాస్
న్యూస్తెలుగు/విజయనగరం : పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే పూజించాలని అవగాహన పరుస్తూ పర్యావరణ కార్యదర్శులు ఉచిత మట్టి వినాయక విగ్రహాల ను పంపిణీ చేశారు. నగరపాలక సంస్థకు చెందిన 1వ సర్కిల్ పర్యావరణ కార్యదర్శులు తమ సొంత నిధులు సమకూర్చి 300 మట్టి వినాయక విగ్రహాలను అందుబాటులోకి తెచ్చారు. వాటిని ప్రజారోగ్యాధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఇతర రసాయన రంగులతో రూపొందించిన వినాయక విగ్రహాల వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని అన్నారు. కావున పవిత్రత చేకూర్చే మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే పూజించడం శ్రేయస్కరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ కార్యదర్శులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు. (Story : ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించండి)