Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌హోరాహోరీగా జరుగుతున్న క్రికెట్ పోటీలు

హోరాహోరీగా జరుగుతున్న క్రికెట్ పోటీలు

హోరాహోరీగా జరుగుతున్న క్రికెట్ పోటీలు

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణంలోని ఆర్డిటి మైదానంలో జరుగుతున్న శ్రీ అటల్ బిహారి వాజ్ పాయ్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండవ రోజు జరిగిన ఐదు మ్యాచుల్లో పది జట్లు పాల్గొన్నాయి. మొదటి మ్యాచ్ బిగ్ డాడీ ధర్మవరం కి ఎలెవన్ లగాన్స్ మధ్య జరిగగా బిగ్ డాడీ ధర్మవరం మీద ఎలెవన్ లగాన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందారు.
రెండవ మ్యాచ్ రొద్దం టీం కి ఆర్కే 11 టీం కి మధ్య జరగగా ఆర్కే 11 టీం మీద రొద్దం టీం 51 యొక్క పరుగుల తేడాతో గెలుపొందింది. మూడవ మ్యాచ్ రొల్ల టీచర్స్ టీం కి స్పార్టనస్ టీం మధ్య జరిగగా రొల్ల టీచర్స్ మీద స్పార్టనస్ టీం 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. నాలుగవ మ్యాచ్ ఎగ్ రైస్ పిటిపి టీం కి ధర్మవరం వన్ టౌన్ పిసి కి మధ్య జరగగా ధర్మవరం వన్ టౌన్ పిసి మీద ఎగ్ రైస్ పిటిపి టీం 13 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐదవ మ్యాచ్ పోట్లమర్రి టీం కి ధర్మవరం కట్టే కింగ్స్ టీం మధ్య జరిగగా పోట్లమర్రి టీం మీద ధర్మవరం కట్టే కింగ్స్ టీం 27 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ ఐదు మ్యాచుల్లో ప్రతిభను చూపిన ఎలెవన్ లగాన్స్ బుట్ర బాబు, రొద్దం రాజేష్, స్పార్టనస్ సోము శేఖర్, ఎగ్ రైస్ పిటిపి పి భరత్, ధర్మవరం కట్టే కింగ్స్ పెద్దన్న అనే ఐదుగురు ఆటగాళ్లకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో మంత్రి కార్యాలయ సిబ్బంది హరీష్, బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, డి చెర్లోపల్లి నారాయణస్వామి, అంబటి సతీష్, ఎర్రజోడు లోకేష్, జింక చంద్ర తదితరులు పాల్గొన్నారు. (Story :హోరాహోరీగా జరుగుతున్న క్రికెట్ పోటీలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!